సిద్దిపేట, డిసెంబర్ 13 : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. అన్ని వర్గాల పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నది. హిందువులకు బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజిన్తోపా అందించి పండుగ రోజు ప్రజలంతా సంతోషంగా గడిపేలా చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా క్రైస్తవులకు ప్రతి క్రిస్మన్కు ప్రభుత్వం కానులను అందిస్తున్నది. ఈ నేపథ్యం లో ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగను పురస్కరించకొని కానుకలు అందించేందుకు జిల్లాకు క్రిస్మస్ కానుకలు చేరుకున్న వైనం పై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం
కులమతాలకతీతంగా..
కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ కుల మతాలకతీతంగా అందరి పండుగలకు కానుకలు అందించడంతో పాటు పం డుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. జిల్లాలో గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, సిద్దిపేట నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి 1000 కానుకలు, మొత్తంగా జిల్లాకు 4000వేల కానుకలు వచ్చాయి. మరిన్ని కానుకలు కావాలని క్రిస్టియన్ల కోరిక మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. క్రైస్తవ సోదరులకు విందు భోజనాల కోసం ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.2లక్షలు మంజూరు చేసింది. కానుకలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. త్వరలోనే క్రిస్మస్ కానుకలను సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు పంపిణీ చేయనున్నారు.ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్, జిల్లాలోని మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లు కానుకలను క్రిష్టియన్లకు అందజేయనున్నారు.
నిరుపేదలకు క్రిస్మస్ గిఫ్ట్ప్యాక్
నిరుపేద క్రైస్తవులు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కానుకలు అందజేస్తున్నారు.ఈ గిఫ్ట్ ప్యాక్లో ఒక చీర, జాకెట్, పంజాబీ డ్రైస్, ప్యాంట్, షర్టు ఉన్నాయి. కుటుంబంలోని చిన్నపిల్లలకు బట్టలు అందించనున్నారు. క్రిస్మస్రోజు కొత్తబట్టలు అందజేయడం నిరుపేద క్రైస్తవులకు వరంలా మారి ంది. క్రైస్తువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.