గజ్వేల్ రూరల్ : చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మున్సిపల్ పరిధిలోని రాజిరెడ్డిపల్లిలో జరిగింది. వివరాల్లోకెళ్లితే.. గ్రామానికి చెందిన బబ్బూరి రాజు(29) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 21 వ తేదీన పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన కుటుంబీకులు వెంటనే గజ్వేల్లోని దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ములుగు మండలంలోని లక్ష్మక్కపల్లిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.