మెదక్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : యాసంగి 2023-24 ధాన్యాన్ని ప్రణాళిక బద్ధంగా మద్దతు ధర పై కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సం బంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్లోని అంబేదర్ సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు, తాగునీటి సరఫరా ప్రణాళికపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. యాసంగి పంట కోతలకు వ స్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. అధికారులు మాత్రమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, ప్రజాప్రతినిధులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్రవ్యాప్తంగా 7149 కొనుగోలు కేంద్రాలు ప్రారం భించాల్సి ఉంటుందన్నారు. కొనుగోలు కేం ద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాల సూచించారు. ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు, టార్పాలిన్ల్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు వాహనాలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రతి గింజకూ మద్ద తు ధర ఇస్తామని తెలిపారు. భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం కొనుగోలు కేంద్రాలకు ట్యాగింగ్ చేసి, విక్రయాలను పూర్తి చేయాలన్నారు. వానాకాలం (2023-24) సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ వేగవంతం చేయాలని, రైస్ డెలివరీ చేసే విధంగా రైస్ మిల్లుల పనితీరును పర్యవేక్షించాలని, దీనిపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. మెదక్ జిల్లాలో 410 కేంద్రాలు కేం ద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కాన్ఫరెన్స్లో డీఏవో గోవిందు, డీఎస్వో బ్రహ్మరావు, డీఎం హరికృష్ణ, అదనపు డీఆర్డీవో సరస్వతి, డీసీవో కరుణ పాల్గొన్నారు.
తాగునీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ తాగునీటి సరఫరాలో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిషరించాలని సూచించారు. గ్రామం, మున్సిపల్ వార్డు స్థాయిలో తాగునీటి సరఫరాపై సమ్మర్ యాక్షన్ప్లాన్, ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎకడా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రమే శ్, జిల్లా పంచాయతీ అధికారి యాద య్య, మిషన్ భగీరథ ఈఈ సంపత్ కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.