సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 13 : మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే ప నుల్లో వేగం పెంచాలని అధికారులను ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సోమవారం హైదరాబాద్లోని అరణ్య భవన్ లో ఉన్న మంత్రి కార్యాలయం నుంచి సంబంధిత తహసీల్దార్లు, ఇరిగేషన్, ఆర్అండ్బీ, రైల్వే అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆర్వోబీలు, సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్లకు సంబంధించి స్థల సేకరణ, పరిహారం గురించి మండలాల వారీగా చర్చించారు. రైల్వేలైన్ ఏర్పాటుకు తెలంగాణ ప్ర భుత్వమే రైల్వేశాఖకు ఉచితంగా స్థలాన్ని అందజేస్తున్నదని, సిద్దిపేట జిల్లాలో 1421 ఎకరాలకు గానూ, 1315 ఎకరాలు, మెదక్ జిల్లాలో 174 ఎకరాలకు 174 ఎకరాల సేకరణ పూర్తయిందని అధికారులు వివరించా రు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడు తూ సిద్దిపేట జిల్లాలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభు త్వం దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేసిందని, తె లంగాణ ప్రభుత్వం ఏ విధం గా అయితే వేగంగా స్థ ల సేకరణ చేసిందో.. అదే విధంగా రైల్వే పనులు వే గవంతం చేయాలని సూ చించారు. త్వరితగతిన రై లు మార్గాలను పూర్తి చేసి జనవరి వరకు ప్రజలకు అందుబాటులోకి తేవాలని డివిజనల్ రైల్వే మేనేజర్ను మంత్రి కో రారు. సంబంధిత ఇతర శాఖల అధికారులు కూ డా సహకరించి, పనులు త్వరితగతిన అయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో సిద్దిపేట కలెక్టర్ హనుమంతరావు, రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ కన్స్ట్రక్షన్ సధర్మ దేవరాయలు, తదితరులు పాల్గొన్నారు.