గజ్వేల్ రూరల్, ఫిబ్రవరి 7: ఆయిల్పామ్ సాగుతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డిలు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని కొడకండ్ల గ్రామంలో దూలం రామాగౌడ్ రైతు పొలంలో ఆయిల్పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తారని, ప్రతిరైతు ఆర్థికంగా ఎదగాలన్నదే ఆయన కల అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనబోమని మొండిగా వ్యవహరించడంతో, రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించిందన్నారు. దీంతో నేడు చాలామంది ఇతర పంటలపై దృష్టి సారించారని, దీంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆయిల్పామ్ పంట ఎంతో లాభసాటిదని, దీన్ని సాగు చేసేందుకు అనువుగా భూములను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఈ పంటకు తెలంగాణ నేలల ఎంతో అనుకూలంగా ఉంటాయని, ఎకరానికి 57మొక్కలు నాటే అవకాశముందన్నారు. దీంతో, 10టన్నుల దిగుబడి వస్తుందని, టన్నుకు రూ.18వేల ధర వస్తుందని తెలిపా రు. పెట్టుబడి పోను ఎకరానికి రూ. 80వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖాధికారిణి రామలక్ష్మి, ఏడీఏ బాబూనాయక్, ఏవో నాగరాజు, ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ, ఎంపీపీ అమరావతి, నాయకులు రవీందర్రావు, పార్టీ మండలాధ్యక్షుడు మధు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, ఎంపీటీసీలు కృష్ణ, అశోక్, నాయకులు రమేశ్గౌడ్, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్, భాస్కర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.