సిద్దిపేట,డిసెంబర్ 18: సిద్దిపేటను క్రీడా హబ్గా మార్చేందుకు మంత్రి హరీశ్రావు కృషి చేస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. ఆదివారం సిద్దిపేట పుట్బాల్ స్టేడియంలోఅండర్-15 ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నీని ఆయన ప్రారంభించారు. మెత్తం 15 టీంలు తలపడగా, ఆదివారం 9 మ్యాచ్లు జరిగాయి. ప్రభుత్వ బాలుర పాఠశాలపై సెంట్జాన్స్ జట్టు, మెరిడియన్ స్కూల్పై శ్రీచైతన్యపాఠశాల జట్టు,సెయింట్ పీటర్స్ స్కూల్ జట్టుపై టెమిరిస్ మైనార్టీ గురుకుల పాఠశాల జట్లు విజయం సాధించాయి. మరో మ్యాచ్లో మెరిడియన్ స్కూల్జట్టుపై ఆర్కిడ్ స్కూల్ జట్టు గెలుపొందాయి.