హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) స్పోర్ట్స్ కోటాలో నియామకానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో దాఖలైన కోర్టు ధికరణ పిటిషన్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పోర్ట్స్ కోటాలో నియామకానికి సంబంధించిన వినతిపత్రంపై పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామన్న హామీని అమలు చేయకపోవడంపై బీ స్వర్ణ అనే అభ్యర్థి కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కేశరత్ విచారణ చేపట్టి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు నోటీసులు జారీ చేస్తూ విచారణను సెప్టెంబర్ 18కి వాయిదా వేశారు. ఇదే పిటిషన్లో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణాతోపాటు మరో ఇద్దరి అధికారులను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించింది.