కొండపాక, జూన్ 8 : నిరుపేదల కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల ఎల్వోసీని అందజేశారు. మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మేడల కనకయ్య కొడుకు వినయ్ అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కనకయ్య వైద్య ఖర్చులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నందున ఈ విషయాన్ని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుమార్యాదవ్ మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి స్పందిస్తూ రూ.2 లక్షల ఎల్వోసీని మంజూరు చేసి చెక్కును మంగళవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మంత్రి హరీశ్రావుకు, ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కనకయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుమార్, నాయకులు వెంకట్రెడ్డి, సున్నం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.