చేర్యాల, జూలై 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో గురువారం నిర్వహించిన సీల్డు టెండర్లు ఖరారైనట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. స్వామి వారి ఆలయానికి సంబంధించిన పాలు, పెరుగు, కూరగాయలు, స్వామి, అమ్మవార్లకు పూలదండలు తదితర వాటిని సరఫరా చేసేందుకు ఆలయ అధికారులు వ్యాపారులు, సంస్థల నుంచి సీల్డు టెండర్లను పిలిచారు. ఆలయ వర్గాల పిలుపు మేరకు పలువురు వ్యక్తులు హాజరయ్యారు.
ఈ మేరకు ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో.. స్వామి వారికి పూలదండలు సరఫరా చేసే హక్కులను చేర్యాల పట్టణానికి చెందిన కోనం నర్సింహులు, స్వామి వారి కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు తీసే హక్కులను సిద్దిపేటకు చెందిన ఎం.భాస్కర్, పాలు,పెరుగు సరఫరా హక్కులను తిమ్మారెడ్డిపల్లికి చెందిన కె.లక్ష్మణ్, కూరగాయలు సరఫరా చేసే హక్కులను కొమురవెల్లికి చెందిన రాజ్కుమార్ దక్కించుకున్నారు.
కాగా హక్కులు దక్కించుకున్న వ్యాపారులు తక్కువ ధరలను కోడ్ చేసి సీల్డు టెండరు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ నీల శేఖర్, సిబ్బంది నర్సింహులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.