చిన్నకోడూరు, జనవరి 12: ఎన్నో ఏండ్ల నుంచి రైతు లు, ప్రజలు ఎదురు చూస్తున్న బీటీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి హరీశ్రావు రూ. 23కోట్లు నిధుల మంజూరు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ తెలిపారు. గురువారం పెద్దకోడూరు, చిన్నకోడూరు గ్రామల్లో సీఎం కేసీఆర్, మం త్రి హరీశ్రావు చిత్రపటాలకు నిర్వహించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డితో కలిసి జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రవాణా సౌకర్యం మెరు గు పర్చడానికి రూ. కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్న ఘనత మంత్రి హరీశ్రావుకే దక్కుతుందన్నారు. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి ప్ర జలు చేరుకోవడానికి లింకు రోడ్లకు మంత్రి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలన్నారు. ఈ రోడ్ల నిర్మాణం పూరైతే భూముల ధరలు మరింత పెగిగే అవకాశం ఉందన్నా రు. అనంతరం ఎంపీపీ మాణిక్యరెడ్డి మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు మండలంపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు బాగుంటేనే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని లింకు రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి మంజూరు చేశారన్నారు. మండలంలోని 16బీటీ రోడ్ల రెన్యువల్ కోసం రూ. 11కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో రిన్యువల్ వేగంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, ఎంపీపీ పాపయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ కుంటయ్య, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. సికింద్లాపూర్ నుంచి అంకిరెడ్డిపల్లె వరకు బీటీ రోడ్డుకు నిధులు మం జూరు కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఘనంగా జాతీయ యువజన దినోత్సవం
జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా వివేకనందుని జయంతిని పురక్కరించుకొని చిన్నకోడూరు మండలంలోని వివేకనందుని విగ్ర హానికి జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ,ఎంపీపీ మాణిక్యరెడ్డిలో పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గోన్నారు.