సిద్దిపేట : జిల్లాలోని రంగనాయక సాగర్ (Ranganayak Sagar) కింద వేసిన పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేశామని మంత్రి కొండ సురేఖ (Minister Konda Surekha )తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమె ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నుంచి లక్షా 10 వేల ఎకరాలకు నీటిని విడుదల చేస్తున్నామని వెల్లడించారు. కుడి కాలువ ద్వారా 40వేల ఎకరాలకు నీటిని విడుదల చేశామని వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 2టీఎంసీ ల నీరు ఉందని అన్నారు.