రామచంద్రాపురం,ఏప్రిల్ 27: బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడిగే హక్కు, అర్హత మనకే ఉందని పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో బీఆర్ఎస్ నిర్వహించిన భారతీనగర్, ఆర్సీపురం డివిజన్ల కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ప్రొటెం మాజీ చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను సరిచేసుకొని పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పటాన్చెరు డివిజన్ నుంచి ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 70వేల మెజార్టీని తీసుకురావాలన్నారు. మెదక్ గడ్డపై ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ అభ్యర్థికి మూడో స్థానం తప్పదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పది రోజులు గట్టిగా పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఈ ప్రాంతంలో జోనల్ కమిషనర్గా, జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా పనిచేసి ప్రజలకు సేవ చేశారని, సేవ చేసే గుణం ఉన్న ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలకు వివరించాలన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓటు అడుగాలని అన్నారు.
మంచి మనిషి వెంకట్రామిరెడ్డి
ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ మన జిల్లాకు మంచి మనస్సున్న ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ప్రకటించడం మన అదృష్టమని, ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోనే జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా ప్రజలకు సేవ చేసిన అనుభవం ఆయనకు ఉన్నదని, అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు పుష్పా నగేశ్, సింధూఆదర్శ్రెడ్డి, నాయకులు అంజయ్య, పరమేశ్, కుమార్గౌడ్, జగన్నాథ్రెడ్డి, నర్సింహ, ఐలేశ్, ప్రమోద్గౌడ్, సత్యనారాయణ, అజీముద్దీన్, రాణి, కృష్ణకాంత్, రాజు, అజీమ్, గఫర్, విష్ణువర్ధన్రెడ్డి, బూన్ తదితరులు పాల్గొన్నారు.