మద్దూరు(ధూళిమిట్ట), మే20 : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీల కతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నట్లు తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ దేశానికే రోల్మాడల్గా నిలుస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రలలో ఇన్ని పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ బ్రోకర్ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసిన మళ్లి అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనన్నారు.
ఓడిపోయిన తర్వాత నియోకవర్గం ముఖం చూడని పొన్నాల లక్ష్మయ్య ఏ ముఖం పెట్టుకొని గ్రామలకు వస్తుండో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మంద యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, తహసీల్దార్లు నరేందర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.