చేర్యాల, అక్టోబర్ 5 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో రాములను తొలగిస్తూ పీఏసీఎస్ డైరక్టర్లు తీర్మానించడంతో పాటు ఆమోదించారు. మంగళవారం పీఏసీఎస్ వైస్ చైర్మన్ తాళ్లపల్లి నర్సయ్య అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అవకతవకలతో పాటు సీఈవో రాములు విధుల్లో అలసత్వం తదితర అంశాల పై చర్చించారు. అనంతరం జిల్లా సహకార అధికారి ఆదేశాల మేరకు సీఈవో విధులు నిర్వహిస్తున్న రాములను తొలగిస్తూ పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించారు.
అలాగే పీఏసీఎస్ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించేందుకు కార్యాలయ సిబ్బంది బునాద్రి కిషన్కు తాత్కలిక సీఈవో బాధ్యతలను అప్పగించారు. సమావేశంలో సొసైటీ డైరక్టర్లు పాల్గొన్నారు.