బెజ్జంకి, ఆక్టోబర్ 20 : బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ భూపాల్రెడ్డి కథనం మేరకు..కోహెడ మండలంలోని మైసంపల్లి గ్రామానికి చెందిన కచ్చు రాజు(41) ద్విచక్రవాహనంపై తన సోదరి ఊరైన తోటపల్లికి మంగళవారం రాత్రి వస్తుండగా గాగిల్లాపూర్ శివారులో రాజీవ్ రహదారిపై హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న టాయోట కారు రాజు వాహనాన్ని వెనుకాల నుంచి ఢీకొట్టడంతో రాజుకు తీవ్ర గాయలయ్యాయి.
దీంతో రాజును అంబులెన్స్లో కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా మార్గ మద్యలో మరణించినట్లు ఎస్ఐ వివరించారు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.