వర్గల్ మార్చి18 : వర్గల్ మండలంలోని గౌరారం రాజీవ్ రహదారి పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు . గౌరారం ఎస్సై సంపత్కుమార్ కథనం మేరకు..హైదారాబాద్ నుంచి సిద్దిపేట వైపు ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఓ యువకుడు బైక్ అదుపు తప్పి బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్ట్ నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.