కోహెడ, ఆగష్టు 30 : సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన జెట్టి మురళి (35) అనే వ్యక్తి సోమవారం రాత్రి విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. సొంత ఇళ్లు నిర్మించుకుంటున్న మురళి ఇంటి వద్ద విద్యుత్ వైర్లకు ప్రమాదవశాత్తు తగిలి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మురళి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.