గజ్వేల్, మార్చి 13: తెలంగాణ వాదానికి ఊపిరిపోసిన మహానే కేసీఆర్ అని గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ (Madasu Srinivas) అన్నారు. మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాన్ని మార్చడానికి భగీరథ తపస్సు చేశారని వెల్లడించారు. వలస పాలకుల చేతిలో జీవచ్ఛవంలా ఉన్న తెలంగాణకు జీవం పోశారన్నారు. బక్క పలసని మనిషైనా ఉక్కు గుండె గలవాడని చెప్పారు. తెర్లయిన తెలంగాణ బతుకులకు తెరచాపై గమ్యం చూపించారని తెలిపారు. స్ట్రేచర్ ఉత్తగనే రాదని, ప్రజలే ప్రాణం అనుకుంటే వస్తుందని చెప్పారు. మంచి మీద పొద్దుపోతే రాదని, మనస్సు పెట్టి పనిచేస్తే వస్తుందని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘అవును…ఆయన స్ట్రెచ్చర్ మీద ఉన్న తెలంగాణ వాదానికి ఊపిరి పోసి రాష్ట్రాన్ని డెలివరీ చేసిన చేసినవాడు. అవును…ఆయన మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాన్ని మార్చడానికి భగీరథ తపస్సు చేసినవాడు. వలస పాలకుల చేతిలో జీవచ్ఛవంలా ఉన్న తెలంగాణకు జీవం పోసినోడు. నీళ్లులేక నెర్రలుబారిన ఈ నెలకు కృష్ణ, గోదావరి జలాలతో ధూప తీర్చినోడు. అన్నం మెతుకు దొరకని తెలంగాణకు అన్నపూర్ణగా మార్చినోడు. షాకులు ఇచ్చే కరెంట్ను సరిచేసి 24గంటలు వెలుగులు విరజిమ్మేలా చేసినోడు.
బక్క పలసని మనిషైనా ఉక్కు గుండె గలవాడు. తెర్లయిన తెలంగాణ బతుకులకు తెరచాపై గమ్యం చూపినవాడు. స్ట్రేచర్ ఉత్తగానే రాదు ప్రజలే ప్రాణం అనుకుంటే వస్తది. మంచి మీద పొద్దుపోతే రాదు మనస్సు పెట్టి పనిచేస్తే వస్తది. ఆయన ఎన్నడూ నీలాగా పదవుల కోసం పలకరించలే. గడ్డి పోసలెక్క పదవుల్ని విసిరేసి తెలంగాణను గెలిచి ప్రజల హృదయాలను గెలుసుకున్నడు. స్ట్రెచర్ మీద ఉన్న తెలంగాణను ఆయన జీవగంజి పోసి బతికిస్తే, నువ్వు అదే తెలంగాణను మార్చురీకి పంపే ప్రయత్నం చేస్తున్నవ్… కేసీఆర్ తెలంగాణ పతారా పెంచి ప్రపంచంతో పోటీపడి పనిచేస్తే నువ్వు చౌకబారు మాటలతో చేతకాక దివాళా తీస్తున్నావ్. నీలాంటి కుక్కలు ఎంత మొరిగినా ఆయన వెరవడు వెయ్యి ఏనుగుల బలాన్ని కూడదీసుకొని మళ్ళీ వస్తాడు. నిన్నూ, నిన్ను ఆడిస్తున్న వాళ్ళ ఆట కట్టిస్తాడు. తిరిగి తెలంగాణను నిలబెట్టి గెలిపిస్తాడు. ఎక్కడ ఉన్నా ఆయన కేసీఆర్ తెలంగాణ స్పార్టకాస్’ అని చెప్పారు.