చేర్యాల, సెప్టెంబర్ 6 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంగళవారం తెలంగాణ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం కోసం మల్లన్న క్షేత్రానికి వచ్చిన దామోదర్గుప్తాకు ఆలయవర్గాలు ఘన స్వాగతం పలికాయి.
అనంతరం రాష్ట్ర చైర్మన్ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు ఆయనకు స్వామి వారి శేష వస్ర్తాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ చరిత్ర, అభివృద్ధి, భక్తుల వసతులు తదితర వాటిని రాష్ట్ర చైర్మన్కు వివరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పడిగన్నగారి ఆంజనేయులు, మహాదేవుని సాంభయ్య, ఏఎస్ఐ, అశోక్రాజ్, నాగరాజు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.