Karra Srihari | బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మృతి పట్ల మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో శ్రీహరి పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాలుగు దశాబ్దాల పాటు సర్పంచ్, పాక్స్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీగా ఎన్నో పదవుల్లో ప్రజాసేవ చేస్తూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన, పారదర్శకతకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు.
కర్ర శ్రీహరి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. నిజాయితీ, అంకితభావం, నిస్వార్థ సేవలతో ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడిగా కర్ర శ్రీహరి ఎప్పటికీ నిలిచిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ఆయన మృతి తీరని లోటు అని కేటీఆర్ అన్నారు. ఆయన వెంట మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, తదితరులు ఉన్నారు.