సిద్దిపేట, ఏప్రిల్ 11: సామాజిక తత్వవేత్త, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాఫూలే చిరస్మరణీయుడని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం జ్యోతిబాపూలే 198వ జయంతిని పురసరించుకొని సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ జ్యోతిబాపూలే బడుగు, బలహీన వర్గాల కోసం చేసిన పోరాటం, ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. వివక్షలేని సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త అన్నారు. ఆయన ఆశయాలు, ఆశలకు అనుగుణంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలన కొనసాగిందన్నారు. మహనీయులు డా. బీఆర్.అంబేదర్, జ్యోతిబాపూలే, బాబు జగ్జీవన్రామ్ కన్న కలలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిజం చేసిందన్నారు.
మహిళలకు గురుకుల విద్యతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. వెనకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను ఏర్పాటు చేసి, అన్ని నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలు నెలకొల్పినట్లు హరీశ్రావు తెలిపారు. బలహీనవర్గాల విద్యార్థుల కోసం ఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఒకొకరికీ రూ.20 లక్షల వరకు ఆర్థికసాయం అందజేసినట్లు చెప్పారు. గ్రామాల్లోని కులవృత్తులను బలోపేతం చేసేందుకు వృత్తులవారీగా ప్రోత్సాహకాలు అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మచ్చ వేణుగోపాల్రెడ్డి, బాల సాయిరాం, మారేడ్ రవీందర్ రెడ్డి, పూల బాలకృష్ణారెడ్డి, శ్రీనివాస్, నర్సింహులు మెరుగు మహేశ్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.
మెదక్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): మహిళలకు సమాజంలో సమాన అవకాశాల కోసం కృషి చేసిన జ్యోతిబాఫూలే నేటి సమాజానికి స్ఫూర్తి అని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ హాలులో ఫూలే జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి నాగరాజుగౌడ్, తెలంగాణ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్, టీఎన్జీవోస్ జనరల్ సెక్రెటరీ రాజ్కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అనురాధ, వసతి గృహ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.