సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 10 : ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా స్పష్టమైన, తప్పుల్లేని ఓటరు జాబితాను రూపొందించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లతో కలిసి ఆర్వో లు, ఏఈఆర్వోలతో ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 22 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. 18 ఏండ్లు నిండి న ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. ఫారం-7, ఫారం-8ల పరిశీలన పూర్తి చేసి ఆన్లైన్ పూర్తి కావాలన్నారు. ఈఆర్వోలు డూప్లికేట్ ఓటర్లపై దృష్టి సారించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అన్ని వివరాలు అందించాలని పేర్కొన్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో నగేశ్, ఐదు నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 10 : వానకాలం, యాసంగి 2022-23సీజన్కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లక్ష్యాన్ని ఈ నెల 25లోగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి రైస్మిల్లర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సివిల్ సైప్లెస్ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్లు, రైస్ మిల్లర్లు, ధాన్యం రవాణా కాంట్రా క్టర్లతో గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైస్ మిల్లులకు ఈఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకు బియ్యం నిల్వలు అందించేలా రైస్ మిల్లర్లు సహకరించాలన్నారు. ఈ నెల 25 లోగా సీఎంఆర్ డెలివరీ చేయాలని ఆదేశించారు. సీఎంఆర్ రైస్ డెలివరీ లక్ష్యాన్ని చేరుకొని మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అలాంటి వారిపై 6ఏ కింద కేసులు బుక్ చేస్తామని, మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టడంతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరించారు. 2022-23 ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన కమిషన్ను 10 రోజుల్లోగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, డీఎస్వో వనజాత, సివిల్ సైప్లె డీఏం సుగుణబాయ్, రైస్ మిల్లర్లు, డీఆర్డీవో శ్రీనివాసరావు, కాంట్రాక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 10 : విద్యార్థులు చదువుల్లో రాణిం చాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలని సంగా రెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జిల్లా మహిళా, శిశు, వికలాగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మహిళా సాధికారత, తారా ప్రభుత్వ కళాశాల మహిళా సాధికారత విభాగం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తారా కళాశాల సెమినార్ హాల్లో బేటీ బచావో – బేటీ పడా వో జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నేటి సమాజంలో చిన్న చిన్న సమస్యలకే విద్యార్థులు కృంగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు గుర్తు చేస్తూ చిన్న పాటి సమస్యలను బయటికి చెప్పుకోలేక తనువు చాలించడం బాధా కరమన్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కా రానికి అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. అదనపు ఎస్పీ అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించు కొని ఉన్న సమ యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సక్సెస్ స్టోరీలను చదవాలని, కష్ట కాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలనే పలు అంశాలపై విద్యార్థులకు అవ గాహన కల్పించారు. అనంతరం కళాశాలలో వివిధ రంగాల్లో రాణించిన విద్యార్థులకు ప్రశాంసా పత్రాలను అదనపు కలెక్టర్, అదనపు ఎస్పీ అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో, తారా కళాశాల పూర్వ విద్యార్థి ఎల్లయ్య, జిల్లా యువజన, క్రీడల అధికారి రామచందర్రావు, తారా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ ఎస్ రత్నప్రసాద్, డీడబ్ల్యూవో సంధ్యారాణి, డీసీపీవో రత్నం, యువజ నోత్సవ కన్వీనర్ సుమతి, కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు ప్రవీణ, డాక్టర్ వెంకటేశం, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ మనోజ్ కుమార్, ఎన్ ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ పద్మజ, డాక్టర్ సిద్దులు, శివదీప్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.