హుస్నాబాద్, నవంబర్ 14: పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని హన్మకొండ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంధనంతో నడిచే వాహనాల వల్ల పొల్యూషన్ పెరిగిపోయి అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయని, పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచాలంటే ఇంధనంతో నడిచే వాహనాల వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంధనం ధరలు కూడా పెరిగిపోతున్నందున ఎలక్ట్రిక్ వాహనాల వినియోగమే చవకగా ఉంటుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, ఎంపీపీ మానస, మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్బాబు, కౌన్సిలర్లు బొజ్జ హరీశ్, నాయకులు ఎండీ అన్వర్, ఎడబోయిన తిరుపతిరెడ్డి, చిట్టి గోపాల్రెడ్డి, బోజు రవీందర్, విజయభాస్కర్, వికాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో పలు బాధిత కుటుంబాలను ఆయా మండలాల ప్రజాప్రతినిధులతో కలిసి పరామర్శించారు.