సిద్దిపేట అర్బన్, మే 03 : రెండు విడుతల్లో బక్రిచెప్యాల గ్రామంలోని అర్హులైన దళితులందరికి దళితబంధు పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామస్తుల విన్నపం మేరకు ఫంక్షన్హాన్ నిర్మాణానికి ఇది వరకు మంజూరు చేసిన రూ.10 లక్షలకు తోడుగా మరో రూ.20 లక్షలు అందించి ఫంక్షన్హాల్ నిర్మాణం చేపడుతామన్నారు. త్వరలోనే ఇంటి స్థలం ఉన్న నిరుపేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు.
గ్రామంలో అర్హులైన నిరుపేద దళితులకు దళితబంధు పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని తెలిపారు. గతంలో వివిధ పనుల కోసం గ్రామానికి అయిన లక్షా 50 వేల అప్పును మంత్రి హరీశ్రావు తన జీతం నుంచి గ్రామస్తులకు అందజేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.