సిద్దిపేట,మే12: ప్రజావాణి కార్య్రకమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార చూపాలని కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్య్రకమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ్రపయాలకు ఓర్చి వస్తారన్నారు.
అధికారులు ఆయా శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 49 ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్య్రకమంలో డీఆర్ఓ నాగ రాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.