సిద్దిపేట, ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): రిజర్వాయర్లు, వాగులు, చెరువుల వద్ద రోజు రోజుకు పెరుగుతున్న సందర్శకుల తాకిడి. నీటితో చెలగాటం వద్దు. నీటితో చెలగాటం చేస్తే ..ప్రాణాలకు ముప్పు. అందుకే చెరువులు,వాగుల వద్ద జర జాగ్రత్తగా ఉండండి. ఉమ్మడి జిల్లాలోగత రెండు సంవత్సరాల నుంచి మంచి వర్షాలు పడడంతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి.ఈ యేడాది జిల్లా వ్యాప్తంగా మంచి వర్షాలు పడడంతో పాటు చాలా వరకు వాగులు, చెరువులు, చెక్డ్యాంలు, కుంటలు నిండాయి. ఎప్పుడూ లేనంతగా జులై మాసంలో బాగా వర్షాలు కురిశాయి. 20 రోజుల పాటు వర్షాలు మొఖం చాటేసి, మళ్లీ వారం రోజల నుంచి జిల్లాలో మంచి వర్షాలు పడుతుండడంతో వాగులు,చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారుగా 7,622 చెరువులున్నాయి. వీటిలో వంద ఎకరాల ఆయకట్టు పైబడిన చెరువులు 679 వరకు ఉంటాయి. ఆయా జిల్లాలో ప్రతి నీటి బొట్టును ఓడిసి పట్టెలా విరివిగా చెక్డ్యాంల నిర్మాణాలు చేశారు. ఈయేడాది ఇప్పటి వరకు 60 శాతంకు పైగా చెరువులు నిండాయి.
దీనికి తోడుగా జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు నిండుకుండలా మారినాయి. అన్నపూర్ణ, రంగనాయక, కొండ పోచమ్మ, శనిగరం మద్యతరహా ప్రాజెక్టు, హల్దివాగు, కూడవెల్లి వాగులతో పాటు మోయ తుమ్మెద వాగు, వనదుర్గ ఘనపురం ఆనకట్ట, సిం గూరు ప్రాజెక్టులున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు నిండి ఉన్నాయి. దీంతో రిజర్వాయర్లు, వాగులు, చెరువుల వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్లో కుటుంబ సభ్యులతో కలసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సందర్శకుల తాకిడి పెరుగుతుండ డంతో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెల్పీ ఫోటోలు, చేపలు పట్ట డం, అలుగు పారుతున్న దృశ్యాలను చూడడం, వాగుల నీటి ప్రవహాలను తిలకించే సమయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
తగు జాగ్రత్తలు తీసుకోవాలి
రిజర్వాయర్లు, ప్రధానకాల్వల వద్ద, చెరువులు, చెక్డ్యాంల వద్ద సందర్శకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.గత ఏడాది మోయ తుమ్మెద వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న సమ యంలో బ్రిడ్జి దాటుతున్న క్రమంలో కోహెడ మండలంలోని బస్వాపూర్ వద్ద లారీ కొట్టుకొని పోయిన సంఘటనలో లారీ క్లీనర్ దాదాపు 12 గంటలకు పైగా మృత్యువుతో పోరాడి చివరకు నీటి ప్రవహంలో కొట్టుకొని పోయిన సంగతి తెలిసిందే. అదే మండలంలో గత ఏడాది చెరువులో ఇద్దరు పిల్లలు పడి చనిపోయారు. రంగనాయక సాగర్ రిజ ర్వాయర్లలో సెల్పీ దిగుతుండగా అందులో పడిపోయి ఓ ఉద్యోగి, రిజర్వాయర్ ప్రధాన కాల్వ లోతు తెలియక అందులో ఈతకు వెల్లి ఇద్దరు చనిపోయారు. ఇలాంటి ఘటనలు ప్రతి యేడాది జరుగుతున్నాయి. ఇలాంటి సమయాల్లో తగు జాగ్రత్తలు సందర్శకులు తగు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీటిలోతు,నీటి అంతు తెల్వకుండా ఏపని చేయరాదు.
నీటి ప్రవహాం అధికంగా ఉన్న సమయాల్లో అటు వైపుగా పోరాదు. దగ్గరి నుంచి కాకుండా దూరం నుంచి నీటి ప్రవహాన్ని చూడాలి. ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా కొంత మంది సెల్పీలు తీసుకుంటారు. ఇటువంటి సమయాల్లోనే తగు జాగ్రత్తగా ఉండాలి. ప్రధాన కాల్వలు, చెరువులు ఎంత లోతు ఉన్నాయో తెల్వదు . ఇది గమనించకుండానే దిగు తుంటారు. అలా చేయవద్దు. కాలువలు, వాగులపై నుంచి దాటేటప్పు నీటి ప్రవహం ఎక్కువగా ఉన్న సమయాల్లో దాటరాదు. నీటి ప్రవహం ఎక్కువగా ఉన్న సమయాల్లో రిజ ర్వాయర్లు, వంతెనలు, బండ రాళ్లపైకి ఎక్కి, సెల్సీలు దిగుతారు. మరికొందరు వంతెన అంచున నిలబడి సెల్పీలు దిగుతుంటారు.గతంలో ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరిగా యి. రిజర్వాయర్లు, చెరువులు, వాగుల వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రదేశాల నుంచే నీటి ప్రవాహన్ని చూడాలి.వాగులు,చెరువులు, కుంటల్లో అజాగ్రత్తగా చేపలు పట్టొద్దు.