పాపన్నపేట, మార్చి 1: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఒకేసారి నాలుగు ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైంది పాపన్నపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన సౌమ్య. రాజప్ప, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. రాజప్ప వ్యవసాయం చేస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాడు. కొడుకు అరవింద్ ఇటీవల జూనియర్ లైన్మన్గా ఉద్యోగం సాధించాడు. రెండో కూతురు సౌమ్య ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. సౌమ్య ప్రాథమిక విద్యను అన్నారంలో, ఉన్నత విద్యను కొత్తపల్లి పాఠశాలలో, ఇంటర్మీడియట్ను మెదక్లోని గీతా, డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేసింది. ఉస్మానియా లో ఎమ్మెస్సీ పూర్తి చేసి, ప్రస్తుతం పీహెచ్డీ మొదటి సంవత్సరం చదువుతున్నది. గ్రూప్-4, టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైంది.