రామాయంపేట, డిసెంబర్ 30 : చలి తీవ్రతతో నారుమడులకు జింక్ లోపం ఏర్పడుతుందని, తద్వారా నారు ఎండుముఖం పడు తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాజకుమారి, ఏడీఏ వసంత సుగుణ పేర్కొన్నారు. జిల్లాలో పట్టాదారు పాసుబుక్క్ ఉన్న రైతులందరూ ఈ-కేవైసీని చేసుకోవాలని సూచించారు. శుక్రవారం రామాయంపేట మున్సిపల్లోని గొల్పర్తి, మండలంలోని అక్కన్నపేట, ఝానిన్సీలింగాపూర్, తొనిగండ్ల గ్రామాల్లో ఈ-కేవైసీ సెంటర్లతోపాటు నారు మడులను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయశాఖ అధికారుల సూచనలను పాటించాలన్నారు. రాత్రిపూట నారుమడుల్లో పూర్తిగా నీటిని తొలిగించాలని సూచించారు. నీటినిల్వతో చలిప్రభావం అధికంగా పెరిగి నారుమడుల్లో జింక్ లోపం ఏర్పడుతుందన్నారు. వరి ఆకులు ఎర్రబడి చనిపోతుందన్నారు. దీనిని నివారించాలంటే నారుమడుల్లో నీటిని తక్కువగా ఉంచాలన్నారు. నారుమడుల్లో జింక్ లోపం నివారణకు జింక్ సల్ఫేట్ మం దును వినియోగించాలన్నారు.
ఎకరా పొలానికి 20 కేజీల జింక్ సల్ఫేట్ పరిపోతుందన్నారు. లీటరు నీటిలో 2గ్రాముల జింక్ సల్ఫే ట్ను కలిపి పిచికారీ చేయాలన్నారు. రాత్రివేళల్లో నారు మడుల్లో నీటిని తొలిగించి, ఉదయం పూట నీటిని పారించాలనివివరించారు. జిల్లాలో పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు లక్షా 30వేల మంది ఉంటే, లక్షా 3వేల మంది మాత్రమే ఈ కేవైసీ చేయించు కున్నట్ల వివరించారు. మిగితా 28వేల మంది రైతులు త్వరలోనే ఈ-కేవైసీ చేసుకోవాలని, ఈ-కేవైసీ చేసుకుంటేనే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రాజ్నారాయణ, ఏఈవోలు రాజు, సాయికృష్ణ, తేజస్వి ఉన్నారు.