అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చూడాలి
కలెక్టర్ హనుమంతరావు
తునికిబొల్లారం కొనుగోలు కేంద్రం తనిఖీ
ములుగు, మే 23: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం ములుగు మండలం తునికిబొల్లారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వాహకులు, రైతులకు సూచనలు చేశారు.
ధాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాలు వెంటనే ట్యాబ్లో నమోదు చేయాలని ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవ కుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వెనువెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు.