సిద్దిపేట, జూలై 14: త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన 15మంది గొర్రెల కాపరులకు మంత్రి హరీశ్రావు నష్టపరిహారం చెక్కులు అందజేశారు. మల్యాల గ్రామంలో నెల క్రితం పిడుగుపడి 153 గొర్రెలు మృతిచెందగా, బాధితులకు ప్రభుత్వం తరఫున సాయం అందించాలని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి సత్యపాల్ను మంత్రి ఆదేశించారు. గొర్రెకు రూ.3వేలు అందిస్తున్నట్లు, సద్వినియోగం చేసుకోవాలని గొర్రెల కాపరులను కోరారు. 153 గొర్రెలకు ఒక్కొక్క గొర్రెకు రూ.3 వేల చొప్పున మొత్తం 4.59 లక్షలు అందించినట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఎంపీపీలు కూర మాణిక్యరెడ్డి, ఒగ్గు బాలకృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్రెడ్డి, కుం భాల ఎల్లారెడ్డి, ఎంపీటీసీ ఆకుల హరీశ్ ఉన్నారు.
మృతుల కుటుంబాలకు మంత్రి పరామర్శ
సిద్దిపేట, జూలై 14: పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు తమ్ముడు వెంకట్ గురువారం గుండెపోటుతో మృతిచెందారు. కుటుంబాన్ని మంత్రి పరామర్శించి ఓదార్చారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ కార్యకర్త మధుకర్రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. గ్రామ ఎంపీటీసీ స్వప్న భర్త ప్రభాకర్ రోడ్డుప్రమాదంలో గాయపడగా, అతడిని పరామర్శించారు. సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల మాజీ సర్పం చ్ నారాగౌడ్ తల్లి లక్ష్మి ఇటీవల మృతిచెందగా, కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, రూరల్ మం డల వైస్ ఎంపీపీ యాదయ్య, నాయకులు ఎల్లారెడ్డి, రమేశ్, శ్రీనివాస్రెడ్డి, పరమేశ్వర్ ఉన్నారు.