కోహీర్, ఏప్రిల్ 1: ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరవేసేందుకు త్వరలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాలులో డివిజన్స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీలతోనే ప్రభుత్వ పథకాలు అందజేస్తామని చెప్పారు. కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదగాలని, పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలను ఉన్నతస్థితికి తీసుకువస్తామని చెప్పారు. ఎంపీ అభ్యర్థి సురేశ్కుమార్ శెట్కార్ గెలుపు కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, మదన్మోహన్రావు, మాజీమంత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు.