పటాన్చెరు టౌన్ : దివ్యాంగులకోసం అండగా ఉంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ పటాన్చెరు డివిజన్ 113లో అలింకో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిని కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన దివ్యాంగులకు, వృద్ధులకు అవసరమైన పరికరాలను ఉచితంగా అందజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ల పరిధిలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నేడు దివ్యాంగుల జీవితాలను సులభతరం చేసే అనేక పరికరాలను పరిశోధకులు రూపొందించారన్నారు. హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న దివ్యాంగులకు ఉపయోగపడే పరికరాలను ఉచితంగా అందజేయడం అభినందించదగ్గ విషయం అన్నారు.
ఆలింకో సంస్థ చేస్తున్న సాయంతో దివ్యాంగుల్లో కొత్త జీవితాలు ప్రారంభం అవుతాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్ప, సింధూరెడ్డి, డిప్యుటీ కమిషనర్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.