కంగ్టి, నవంబర్ 17 : రోడ్డు ప్రమాదంలో కంగ్టి మండల టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ పండరి (25) మంగళవారం రాత్రి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా పిట్లం నుంచి బైక్పై వస్తుండగా.. రోడ్డుపై పోసి ఉన్న వరిధాన్యాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదం జరిగింది. దీంతో పండరి అక్కడికక్కడే మృతి చెందాడు.
పండరి ఆకస్మిక మృతి చెందడంతో మండలంలో విషాధచాయలు అలుముకున్నాయి. పార్టీ కార్యక్రమాలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండే పండరి ఇక లేరనే విషయం టీఆర్ఎస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పోస్ట్మార్టం అనంతరం స్వగ్రామం దామరిగిద్ద గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. పండరి మృతిపట్ల వారి కుటుంబ సభ్యులకు ఎంపీపీ సంగీత, జడ్పీటీసీ కోట లలిత, మండలాధ్యక్షుడు గంగారం ప్రగాఢసానుభూతి తెలిపారు.