కోహీర్, జూన్15 : ప్రతిఒక్కరు క్రీడల్లో శిక్షణ పొంది తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బిలాల్పూర్ గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన మైదానంలో అన్ని రకాల ఆటలను ఆడాలని విద్యార్థులకు సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో రాణించి దేశానికి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ రాందాస్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, తహసీల్దార్ కిషన్, ఎంపీడీవో సుజాతనాయక్, ఎంపీవో వెంకట్రెడ్డి, సొసైటీ చైర్ పర్సన్ స్రవం, సర్పంచులు నర్సింహులు, రాజశేఖర్, రవికిరణ్, సంగారెడ్డి, రమేశ్, కిష్టయ్య, ఎంపీటీసీ బక్కారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.