కల్హేర్, అక్టోబర్ 29 : ప్రమాదవశత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. కల్హేర్ మండల పరిధిలోని కాల్వోనికుంట తండాలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల్లో తండా వాసులు పాల్గొన్నారు. కాగా, అంత్యక్రియలు ముగిసిన తర్వాత తండా శివారులోని చెరువులో స్నానాలు చేసేందుకు వెళ్లారన్నారు.
తండాకు చెందిన విస్లవత్ హర్యనాయక్ (42) స్నానం చేసేందుకు చెరువులోకి దిగగా కాలు జారీ చెరువులో పడిపోయాడన్నారు. అందరూ చూస్తుండగానే నీట మునిగి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతుడి భార్య విస్లవత్ శాంతిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.