న్యాల్కల్/సంగారెడ్డి : మొన్న తల్లి, నేడు తండ్రి మరణంతో వారి కుటుంబంలో తీవ్ర విచారాన్ని నింపింది. అమ్మానాన్నలిద్దరు రోజుల వ్యవధిలోనే కన్నుమూయడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆరు రోజుల క్రితం భార్య మృతి చెందింది. ఆదివారం భర్త మృతి చెందాడు. ఈ విషాదకర సంగటన న్యాల్కల్ మండలం అమీరాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది.
స్థానిక గ్రామస్తుల కథనం ప్రకారం..అమీరాబాద్ గ్రామానికి చెందిన బీరధార్ మారుతీ రావు(26), భార్య స్వప్న బాయి (24), వారి పిల్లలు విగ్నేష్ (8), రాధా బాయి(6) ఉన్నారు. స్థానిక గ్రామంలోని టీ కొట్టు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అలా సాఫీగా వారి జీవనం కొనసాగుతున్న తరుణంలో మారుతీ రావు భార్య స్వప్న బాయి పలు జబ్బులతో బాధపడుతూ అనారోగ్యానికి గురైం ఈనెల 26వ తేదీన ఆమె మృతిచెందింది. మారుతీ రావు కూడా పలు జబ్బులతో బాధపడుతూ.. భార్య మృతి చెందిన బాధతో కలతచెంది ఆదివారం మృతి చెందాడు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. దాతలు, ప్రభుత్వం చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.