MLA Gudem Mahipal Reddy | పటాన్ చెరు, అక్టోబర్ 27: పటాన్ చెరులో ఘనంగా ఛట్ పూజా కార్యక్రమం నిర్వహించారు.ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా సోమవారం పటాన్ చెరు పట్టణంలోని సాకి చెరువు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలతో కలిసి సాకి చెరువు కట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను గౌరవించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రజలదని అన్నారు. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం పటాన్చె రు నియోజకవర్గం అన్నారు. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ అందజేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ ప్రజలతో సమానంగా అన్ని రాష్ట్రాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. భగవంతుడి కృపతో వచ్చే సంవత్సరం ఛట్ పూజ లోపు సాకి చెరువు కట్ట పైన సూర్య భగవాన్ దేవాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సూర్య భగవానుడి పూజల కోసం ప్రత్యేక ఘాట్ సైతం నిర్మిస్తామని తెలిపారు. అనంతరం ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెంను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సాయిద్రజ మాజీ ఎమ్మెల్యే మనోజ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, డీఎస్పీ ప్రభాకర్, స్థానిక నాయకులు, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Chhat Pooja

Chhat Pooja1