సంగారెడ్డి : సమస్యలకు పరిష్కారం చూపాల్సిన విద్యా సంస్థలు కొన్ని చోట్ల విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. సంగారెడ్డి శివారులోని కందిలో గల ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో మానసిక ఒత్తిడితో మమైతనాయక్ (21) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఒడిశాకు చెందిన మమైత్ గత నెల 26న ఎంటెక్ ప్రథమ సంవత్సరంలో చేరింది. తన గదిలోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. మానసిక ఒత్తిడి గురవుతున్నాను’ అని రాసి ఉన్న లేఖను మమైత గదిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించేలా క్యాంపస్లో యాజమాన్యం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది.