చేగుంట, నవంబర్25: ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మక్కరాజిపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ సందర్శించారు. కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ రైతుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఎంపీ వెంట జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, సుభాష్రెడ్డి, రజనక్ ప్రవీణ్కుమార్, ఇబ్రహీంపూర్ మాజీ సొసైటీ చైర్మన్ కొమండ్ల నారాయణరెడ్డి, బాపురెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, నాయకులు జింక శ్రీనివాస్, విశ్వేశ్వర్, హోలియానాయక్, నెల్లూరు మోహన్, అబరబోయిన మల్లయ్య, సోమ సత్యనారాయణ తదితరులున్నారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ
మండలంలోని పలు గ్రామాల్లోని పలు బాధిత కుటుంబాలను ఎంపీ పరామర్శించారు. చేగుంట, మక్కరాజిపేటలో రెండు కుటుంబాలు, కరీంనగర్, పులిమామిడిలో మూడు కుటుంబాలను, కిష్టాపూర్లో బాధిత కుటుంబాలను ఎంపీ పరామర్శించి బాధిత కుటుంబాలకు మనోధైర్యం చెప్పారు.