ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పోడు భూములు, ఆధార్ అనుసంధానం, అంగన్వాడీ డే, ధరణి, తదితర విషయాలపై దిశానిర్దేశం చేశారు. దళితబంధు లబ్ధిదారుల ఆర్థిక అభివృద్ధికి సహకారాన్ని అందించాలని సూచించారు. అధికారులందరూ బాధ్యతగా పనిచేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 26: జిల్లాలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులతో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి కొనుగోలు కేంద్రాలు, పోడు భూములు, ఆధార్ అనుసందానం, అంగన్వాడీ, ధరణి, తదితర విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన్యత కార్యక్రమాలపై పంచాయతీ స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు దృష్టి సారించాలన్నారు. అలక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి గ్రామం లో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. స్థానికంగా హమాలీలను ఏర్పా టు చేసుకోవాలని, స్థానికంగా అందుబాటులో లేనియెడల ఇతర ప్రాంతాల వారిని ఏర్పాటు చేసుకోవాలన్నా రు. ధాన్యం కొనుగోలు కేంద్ర ఇన్చార్జిలతో సహా అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
పోడు భూముల పరిశీలన పూర్తి
జిల్లాలో పోడు భూముల వెరిఫికేషన్ పూర్తయిందని, పూర్తి చేసిన మండల, గ్రామ పంచాయతీ, అటవీ శాఖ అధికారులను కలెక్టర్ అభినందించారు. డివిజన్ స్థాయి కమిటీ సమగ్రంగా పరిశీలించి ఈ నెల 31లోగా జిల్లా కమిటీకి సమర్పించాలని సూచించారు. జిల్లాలో ఆధార్ సీడింగ్ 100శాతం పూర్తి కావాలన్నారు. ఈ నెల 31లో గా ఓటరు ఐడీ కార్డుకు ఆధార్ అనుసంధానం గ్రామీణ ప్రాంతాల్లో 90శాతం, మున్సిపాలిటీల్లో 85శాతం, అర్బ న్ ఏరియాలో (జీహెచ్ఎంసీ) 80శాతానికి తగ్గరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. లక్ష్యం మేరకు పూర్తి కానట్లయితే బీఎల్వో మొదలు ఏఈఐర్ఓ, ఈఆర్ఓలపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు.
రిపీట్ పిటీషన్స్ కోసం ప్రత్యేకించి రిజిస్టర్ పెట్టాలన్నారు. అందులో ప్రతి రిపీట్ పిటిషన్ నమోదు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. అదేవిధంగా బ్యాంకు లింకేజీ లక్ష్యం పూర్తి కావాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన లక్ష్యాన్ని మించి పూర్తి చేసిన ఆయా అధికారులను కలెక్టర్ అభినందించారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వివిధ శాఖలపై వచ్చిన పిటిషన్స్కు సంబంధించి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దళితబంధు లబ్ధిదారుల ఆర్థిక అభివృద్ధికి కావాల్సిన సహకారాన్ని ఆయా అధికారులు అందించాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షీ షా, వీరారెడ్డి, డీఆర్వో రాధికా రమణి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరరావు, అధికారులు పాల్గొన్నారు.