అదనపు కలెక్టర్ రాజర్షి షా
సంగారెడ్డి, మార్చి 30 : జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు భగీరథ నీటి కోసం నల్లాలు బిగించాలని, ఐదేండ్లలోపు పిల్లలకు ఐఫా సిరప్ తాగించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమశాఖ, వైద్యారోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ దృష్టి పెట్టాలని, వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి కోసం భగీరథ నల్లాలను బిగించాలని, పిల్లలకు శ్రేష్టమైన తాగునీటిని అందించి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందుకోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఐఫా సిరప్ను ప్రతి చిన్నారికీ తాగించాలన్నారు. ముఖ్యంగా ఐదేండ్లలోపు పిల్లలకు తాగించేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. బ్లూకలర్ టాబ్లెట్స్ కిశోర బాలికలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరఫరా చేస్తున్నమన్నారు. జిల్లాలో నూతనంగా అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, వాటిని అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి పద్మావతి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
అప్పర్భద్రకు ఇస్తున్నారు.. మాకెందుకివ్వరు?
సీఎం చొరవతోనే గిరిజన లా కాలేజీ