జహీరాబాద్, జూన్ 16 : ప్రజలకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. గురువారం జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని శాంతినగర్తో పాటు పలు కాలనీల్లో పర్యటించి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వానకాలంలో ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేసి ఆకు పచ్చని జహీరాబాద్కు కృషి చేయాలన్నారు. మున్సిపల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసేందుకు మిషన్ భగరీథ పనులు చేపట్టామన్నారు.
సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి పనులు తెలంగాణలో చేస్తున్నారన్నారు. అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ ప్రభుత్వంను ప్రజలు ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాశ్రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహినోద్దీన్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.