IND vs ZIM : రెండో టీ20లో భారత టాపార్డర్ బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(8) మళ్లీ విఫలమవ్వగా.. తొలి మ్యాచ్లో అర్ధ శతకతో కదంతొక్కిన వైభవ్ సూర్యవంశీ(20)లు మెరుపులకు నగవరా తెరదించాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (25) కుదురుకున్నట్టే కనిపించినా బ్రియాన్ బెన్నెట్ ఓవర్లో వెనుదిరిగాడు. దాంతో.. 95కే టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం తిలక్ వర్మ(5 నాటౌట్), ఇషాన్ కిషన్(44 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ(8) ఈసారి కూడా నిరాశపరిచాడు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన అతడిని ముజరబని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత 3 ఫోర్లు, ఒక సిక్సర్తో రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ(20) జింబాబ్వే బౌలర్లను భయపెట్టాడు. కానీ, అదే ఊపులో ఆడబోయి అతడు వికెట్ సమర్పించుకున్నాడు.
5⃣0⃣ partnership 🆙
A fluent stand building between Captain Shreyas Iyer and Ishan Kishan 🤜🤛
Updates ▶️ https://t.co/Z8UUziVx8d#TeamIndia | #ZIMvIND pic.twitter.com/IkcC30WV4W
— BCCI (@BCCI) July 25, 2026
ఆతిథ్య జట్టు బౌలర్ల విజృంభణతో 29 కే రెండు వికెట్లు పడిన వేళ.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(25), ఇషాన్ కిషన్(44 నాటౌట్)లు దూకుడుగా ఆడి స్కోర్బోర్డును ఉరికించారు. అయితే.. బెన్నెట్ ఓవర్లో అయ్యర్ ఔటవ్వడంతో ఇషాన్, తిలక్ వర్మ(5 నాటౌట్)లు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. 11 ఓవర్లకు భారత జట్టు స్కోర్.. 104-3.