నారాయణఖేడ్, మే 19 : జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుని మహిళల వద్ద నుంచి నగదు, నగలను దొంగిలిస్తున్న మహిళను సీసీ కెమెరాల సహాయంతో సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. గత సోమవారం కంగ్టి మండలం సుక్కల్తీర్థ్ గ్రామానికి చెందిన విటాబాయి హైదరాబాద్ నుంచి వచ్చి నారాయణఖేడ్ మార్కెట్లోని స్టీల్ షాపులో షాపింగ్ చేస్తుంది.
ఈ క్రమంలో ఓ మహిళ విటాబాయి బ్యాగులో నుంచి డబ్బులు, రెండు బంగారు ఉంగరాలను దొంగిలించింది. ఆ మరుసటి రోజైన మంగళవారం మార్కెట్లో మరో మహిళ వద్ద నుంచి పర్సు దొంగిలిస్తుండగా సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు పట్టుకున్నారు. ఆమెను పోలీస్స్టేషన్కు తరలించి విచారించగా.. మహారాష్ట్రలోని దెగ్లుర్కు చెందిన దుర్గా వాడేకర్గా గుర్తించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్ఐ వివరించారు.