అమీన్పూర్, నవంబర్ 11 : దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐటీడబ్ల్యూ సిగ్నోడ్ కాలనీలో నూతనంగా నిర్మించ తలపెట్టిన వినాయక దేవాలయ భూమి పూజ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డితో కలిసి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.