సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం ఉదయం కవలంపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహానం ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒకరు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సంగారెడ్డి దవాఖానకు తరలించారు.
ప్రమాదం దాటికి తుఫాన్ వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధితులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.