రామచంద్రాపురం, మార్చి10: యువత బంగారు భవిష్యత్తు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను భారీగా ప్రకటించిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం తెల్లాపూర్లో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ నేడు వాటిని సాకారం చేశారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సీఎం కేసీఆర్ ప్రకటనలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య సమసిపోతుందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సోమిరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.