పటాన్చెరు, జూన్ 1 : వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సూచించారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్షాకాలం అత్యవసర సమయంలో సేవలు అందజేసేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యవసర సహాయక బృందాలను కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పనగేశ్, సింధుఆదర్శ్రెడ్డిలతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వస్తున్న వర్షాకాలంలో అత్యవసరమైన సేవలను అందజేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా పలు టీమ్లను, వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. భారీ వర్షాలు కురిస్తే మురుగునీటి కాలువలు, నాలాలు పొంగకుండా చూస్తారన్నారు. అన్ని శాఖలు సమన్వయంగా ఉంటూ సమస్యలు వస్తే తక్షణం వాటిని పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలను అందజేయాలని కోరారు.
ప్రజలకు వర్షాకాలం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం జీహెచ్ఎంసీ సిబ్బంది సేవలు అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ బాలయ్య, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరమేష్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.