జిన్నారం, మార్చి 28 : కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు. జిన్నారంలో సోమవారం 41 మందికి, బొల్లారంలో 22 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లల తల్లిదండ్రులకు కొండంత అండగా మారాయన్నారు. అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక అండ కల్పిస్తున్నారని అన్నారు.
దేశంలోనే ఇలాంటి పథకాలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు ఈ పథకాలను అమలు చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్గౌడ్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, తహసీల్దార్ దశరథ్, సర్పంచ్లు లావణ్య, శివరాజ్, ఆంజనేయులు, వెంకటయ్య, జనార్దన్, ఖదీర్, మండల అధ్యక్షుడు రాజేశ్, ఎంపీటీసీ లావణ్య, ఉపసర్పంచ్ సంజీవ, తదితరులు పాల్గొన్నారు.