భారతీయ వివాహాలు అంటేనే రంగులు, హడావుడి. పెండ్లిపీటలు ఎకే సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక విషయంలో చిన్నపాటి ఆందోళన కలగడం సహజమే. కానీ, జైపూర్లో జరిగిన ఒక పెండ్లిలో మాత్రం అప్పటికప్పుడు ఎదురైన సమస్యను పరిషరించడానికి ఆధునిక సాంకేతికత అండగా నిలిచింది. సంప్రదాయ వేడుకలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించి, ఒక సరికొత్త ట్రెండ్కు తెరలేపింది. ముంబైకి చెందిన కంటెంట్ స్ట్రాటెజిస్ట్ అనూషా జైన్ వివాహం సందర్భంగా.. పెండ్లికి ముందు రోజు జరిగే మెహెందీ వేడుక సమయానికి అతిథుల రాకతో ఇల్లంతా కోలాహలంగా మారింది.
రొటీన్ డిజైన్లు కాకుండా ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నప్పటికీ, బిజీ షెడ్యూల్ వల్ల ఎలాంటి డిజైన్ను ఎంచుకోలేకపోవడంతో, సరిగ్గా మెహెందీ ఆర్టిస్ట్ చేతిలో గోరింటాకు శంఖం పట్టుకుని ‘ఏ డిజైన్ వేయమంటారు?’ అని అడిగేసరికి అనూషా ఒకసారిగా కంగారుపడ్డది. ఆ క్లిష్ట సమయంలో ఆమె సోదరుడు చాట్జీపీటీ సహాయం తీసుకోమని ఇచ్చిన ఐడియా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సరదాగా ప్రారంభించిన ఆ ప్రయత్నం క్షణాల్లోనే అద్భుతాన్ని ఆవిషరించింది. తన సొంత ఊరు, భర్త ఊరు, ఇద్దరికీ ఉన్న ఆహారప్రియాత్వం, వారి వివాహ థీమ్ ‘అరౌండ్ ద వరల్డ్’ లాంటి వివరాలను టూల్లో నమోదు చేశారు. కొద్ది సెకన్లలోనే వారి ప్రేమ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా వినూత్న ఆలోచనలను ఏఐ అందించింది.
వధువు ఊరు ముంబైకి గుర్తుగా ఆటో-రిక్షా, వరుడి ఊరు జైపూర్ రాజసానికి ప్రతీకగా ఏనుగు, నిరంతర ప్రయాణాలకు గుర్తుగా ముంబై ఎయిర్ పోర్ట్, అలాగే అరచేతి మధ్యలో ఇరు కుటుంబాల పేర్లతో క్రాస్ వర్డ్ పజిల్ వంటి ప్రతిపాదనలను ఏఐ అందించింది. అయితే, సాంకేతికత అందించిన ఆలోచనకు ప్రాణం పోసింది మాత్రం మెహెందీ ఆర్టిస్ట్ నైపుణ్యమే. ఏఐ అందించిన కాన్సెప్ట్ను ఆర్టిస్ట్ తన నైపుణ్యంతో వేసిన ఆ కళాఖండం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ కావడమే కాకుండా, చాట్జీపీటీ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలోనూ చోటు దకించుకుంది. సాంకేతిక పరిజ్ఞానం కేవలం ఆఫీసు పనులకే కాకుండా, జీవితంలో మరచిపోలేని ప్రత్యేక ఘట్టాల్లోనూ భాగమవుతుందని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.